chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: డ్రైన్ నిర్మాణం అనంతరమే రోడ్ల నిర్మాణం చేపట్టాలి

GUNTUR COMMISSIONER VISIT DEVELOPMENT PROGRAMMES

గుంటూరులో నూతనంగా నిర్మాణం చేసే రోడ్లు డ్రైన్ నిర్మాణం అనంతరమే చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. గురువారం స్తంభాల గరువు, బ్రాడీపేట, అరండల్ పేటల్లోని పలు ప్రాంతాలను పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో డ్రైన్ లు ఏర్పాటు చేయకుండా రోడ్లు నిర్మాణం చేయడం వలన వర్షాలకు రోడ్లు నీరు నిలిచి మరమత్తులకు గురువుతున్నాయన్నారు. కనుక రోడ్లతో పాటు డ్రైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. డ్రైన్ల ఆక్రమణలపై పట్టణ ప్రణాళిక అధికారులు కఠినంగా ఉండాలని, ఎక్కడైనా ఆక్రమణలు గుర్తిస్తే సంబందిత ప్లానింగ్ కార్యదర్శి, టిపిబీఓపై చర్యలు తీసుకుంటామన్నారు. అరండల్ పేట ఒకటవ లైన్ లో డ్రైన్ ఓవర్ ఫ్లోపై ప్రజల నుండి అందిన ఫిర్యాదు మేరకు పరిశీలించి, తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. అనంతరం స్తంభాల గరువు మహా ప్రస్తానంని పరిశీలించి, జిఎంసి నుండి తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.పర్యటనలో ఈఈ వేణుగోపాల్, ఏ సిపి రెహ్మాన్, ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker