Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: నగరపాలక సంస్థలో వందేమాతరం వేడుకలు

VANDEMATARAM CELEBRATION IN GUNTUR

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భారతీయుల్లో వందేమాతర గీతం దేశభక్తి స్పూర్తిని నింపిందని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. వందేమాతర గీతం వ్రాసి 150 ఏళ్లు నిండిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అధికారులు, సిబ్బంది వందేమాతర గీతం ఆలపించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతర గీతం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చి, సామాన్యులనూ సమరయోధులుగా మార్చిందన్నారు. వందేమాతర గీతం భారతీయులలో జాతియతను నింపి, స్వాతంత్య్రి కాంక్షను నింపిందన్నారు. ఈ గేయాన్ని బకించంద్ర చటర్జీ 1875 ఆనంద్ మఠం అనే నవలలో వ్రాశారని, నేటికి ఈ గేయానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సి.హెచ్ శ్రీనివాస్, బి. శ్రీనివాసరావు, మేనేజర్ బాలాజీ బాష, సుపెరింటేన్దేంట్లు, వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button