chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: పన్నులు చెల్లించని వారికి గుంటూరు కమీషనర్ హెచ్చరిక

GUNTUR COMMISSIONER STATMENT

గుంటూరు నగరపాలక సంస్థకు బకాయిలు ఉన్న పన్నువసూళ్లకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, మొండి బకాయిదారుల ఇళ్లు, కమర్షియల్ సంస్థలకు ట్యాప్, డ్రైనేజి కనెక్షన్ లు తొలగించాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అధికారులకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో రెవెన్యూ విభాగ సమీక్షా సమావేశం జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ తొలుత వార్డ్ సచివాలయాల వారీగా ఉన్న అసెస్మెంట్లు, బకాయిలు, రోజువారీ వసూళ్లు చేయాల్సిన లక్ష్యంపై సమీక్షించి, పన్ను వసూళ్లలో పురోగతి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, మాట్లాడుతూ, రోజువారీ నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా చేయాల్సిన పన్ను వసూళ్లలో జీరో శాతంతో ఉన్న అడ్మిన్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. అలాగే విభాగాదిపతులకు పన్ను వసూళ్ల పర్యవేక్షణ విధులు కేటాయించాలన్నారు. ఇప్పటికే రెండో అర్ధ సంవత్సరం వచ్చినప్పటికీ ఆస్తి, ఖాళీ స్థల, త్రాగునీటి, మీటర్ల చార్జీలు వసూళ్లలో అలసత్వం వీడకుంటే ఎలా అని ప్రశ్నించారు. బకాయిదారులకు పన్ను చెల్లింపుపై నోటీసులు ఇవ్వడం, స్పందించకుంటే ట్యాప్, డ్రైనేజి కనెక్షన్ లు డిస్ కనెక్షన్ చేయడం, రెడ్ నోటీసులు ఇచ్చి తదుపరి ఆస్తులు జప్తు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పన్ను వసూళ్లపై డిప్యూటీ కమిషనర్లు మరింతగా క్షేత్ర స్థాయిలో పాల్గొనాలని, అధిక మొత్తం బకాయిదారులను నేరుగా కలవాలని ఆదేశించారు. పన్ను వసూళ్ల రోజువారీ నివేదిక ప్రతి రోజు సాయంత్రం తమకి అందించాలని ఆదేశించారు.సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు రవికిరణ్ రెడ్డి, మదన్ గోపాల్, రెహ్మాన్, సాదిక్ భాష, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ కార్యదర్శులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker