chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: ప్రమాదకరంగా ఉన్న కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలి

GUNTUR COMMISSIONER STATMENT ON DEVELOPMENT PROGRAM

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులను నిర్దేశిత సమయంలో పూర్తీ చేయడానికి ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కల్గించేలా విధ్యుత్ స్థంభాలకు ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఏటి అగ్రహారం, శ్యామల నగర్, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను వేగంగా చేపట్టకుంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. కనుక ఇంజినీరింగ్ అధికారులు తమ పరిధిలోని జరిగే పనులను నిర్దేశిత గడువు మేరకు, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. అలాగే ప్రధాన రోడ్ల వెంబడి విధ్యుత్ స్తంభాలకు వివిధ రకాల కేబుల్స్ వేలాడుతూ ప్రజల, వాహనాల రాకపోకల సమయంలో అడ్డుపడి ప్రమాదకరంగా మారుతున్నాయని, వాటిని తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శ్యామల నగర్ లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసిన భవనంను పరిశీలించి, పట్టణ ప్రణాళిక సచివాలయ కార్యదర్శులు భవన నిర్మాణ సమయంలోనే నిర్దేశిత అనుమతి పొందిన ప్లాన్ మేరకు నిర్మాణాలు జరిగేలా చూడాలన్నారు. పర్యటనలో ఈఈలు విష్ణు, కోటేశ్వరరావు, డిఈఈ రమేష్ బాబు, ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker