Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: మహిళల ఆరోగ్య భద్రత కోసం గుంటూరులో సురక్ష క్యాంప్

MEDICAL CAMP FOR WOMEN'S IN GUNTUR

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 24వ డివిజన్ చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, మెప్మా ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘సఖి రక్ష – సఖి సురక్ష’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి డ్వాక్రా మహిళ ఆరోగ్య భద్రత కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో, 35 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు, 55 ఏళ్ళు పైన వయసున్న మహిళలకు ప్రత్యేకంగా, మూడు రోజులపాటు విస్తృత స్థాయి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. క్యాన్సర్‌లు, రెస్పిరేటరీ సమస్యలు, షుగర్, లైఫ్ స్టైల్ డిసార్డర్స్, ఎనీమియా వంటి మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టి 14 రకాల ముఖ్యమైన హెల్త్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఒక వారం రోజుల్లో ప్రతి మహిళకు వ్యక్తిగత హెల్త్ కార్డు ఇచ్చి, ఏదైనా ఆరోగ్య సమస్యలు కనపడితే నేరుగా ప్రభుత్వం హాస్పిటల్‌కి రిఫర్ చేసి పూర్తి స్థాయి ఫాలోఅప్, చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. అదే విధంగా ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి మహిళకు ₹5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం అందుబాటులో ఉండటం ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. డ్వాక్రా మహిళల స్వయం సాధికారత కోసం ఈ పథకం మరో భారీ అడుగుగా నిలుస్తుందని, ప్రతిరోజూ కనీసం 600 మందికి టెస్టులు – ట్రీట్మెంట్లు అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందని, ఇప్పటికే సఖి సురక్ష టీంను ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలైందని, టెస్టులు చేసిన ప్రతి మహిళకు పూర్తిస్థాయి చికిత్స అందించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker