chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తాం

GUNTUR MLA NASEER DISTRIBUTION CMRF CHEQUES

రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి అగ్ర తాంబూలమిస్తోందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. బుధవారం స్థానిక తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో రూ.1.58 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. గుంటూర తూర్పు నియోజకవర్గానికి చెందిన మేకా శాంతకుమారి, తమన్నా సుజాత, గుంటి సంధ్యారాణి అనారోగ్యానికి గురై ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందారు. వీరు నిరుపేదలు కావడంతో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా చెక్కులు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ పేదల ఆరోగ్యానికి రక్షగా నిలుస్తున్నామని వెల్లడించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.7 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ అందించామని తెలిపారు.

Nandha Jyothiఏ ఒక్కరికీ వైద్య సేవలు దూరం కాకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. వైద్య రంగానికి వేల కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి సంజీవనిగా ఉన్న గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో అన్ని విభాగాల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం, దాతల సాయంతో ఆధునిక పరికరాలను సమకూర్చామని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ సమయంలోనైనా ప్రజలు తనను సంప్రదించవచ్చని సూచించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker