chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: సరస్ మేళాను సందర్శించిన ప్రజా ప్రతినిధులు

MLAS VISIT SARUS MELA

శనివారం నల్లపాడు రోడ్డులో రెడ్డి కళాశాల సమీపంలో జరుగుతున్న సరస్ మేళా అఖిలభారత డ్వాక్రా బజార్ ను చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహ్మద్ ససీర్ అహ్మద్, నగరపాలక సంస్థ మేయర్ కొవెలమూడి రవీంద్ర   సందర్శించారు. ప్రాంగణంలో స్టాల్స్ వద్ద, ఫుడ్ కోర్ట్ పరిశీలించారు. స్వయం సహాయ సంఘాల సభ్యులు తయారుచేసి ఉత్పత్తులను పరిశీలించి పలు వస్తువులను కొనుగోలు చేశారు. వివిధ రాష్ట్రాల వంటకాలను రుచి చూసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతకు సమగ్ర వేదికగా  సరస్ మేళా అఖిలభారత డ్వాక్రా బజార్ ఉందని తెలిపారు. ఢిల్లీ స్థాయిలో జరిగే జాతీయస్థాయి డ్వాక్రా బజార్ ను గుంటూరు లో ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. మేళాలో దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకంతో పాటు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక సాధికారిత సాధించాలన్న మహిళలకు ప్రేరణ కలిగించేలా ఉందన్నారు. సరస్ మేళాను ఇక్కడ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి, కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. స్టాల్స్ నిర్వాహకులకు, సందర్శకులకు ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం పట్టిష్ట ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా, ఎపిడి కిరణ్ కుమార్, డిపిఎం అశోక్ కుమార్, ఏపీఎం సురేష్, కార్పొరేటర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker