Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకామారెడ్డికృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్గుంటూరు

GUNTUR: కార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం

AUTO DRIVER SEVALO PROGRAM IN GUNTUR

ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం ప్రారంభోత్సవం గుంటూరులో జరిగింది. రెవెన్యూ కళ్యాణ మంటపంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ అతిథిలుగా హాజరై ప్రారంభించారు. జిల్లాలోని 13,193 మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రులు మాట్లాడారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభావం ఆటో డ్రైవర్లపై పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో 10 వేలు సాయం అందించి 20 వేలు గ్రీన్ టాక్స్ వసూలు చేశారు. నేడు అదే టాక్స్ మూడు వేలకు తగ్గించడం జరిగింది. 80 శాతం గంజాయి వాడకం తగ్గించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. గత ప్రభుత్వంలో సంక్షేమం మాత్రమే జరిగితే నేడు అభివృద్ధి, సంక్షేమం సమాన రీతిలో జరుగుతుందని. ఆటో డ్రైవర్ లు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహ్మద్ నసీర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కలెక్టర్ తమీమ్ అన్సారియా తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button