
నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా MDM మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సౌత్ డీఎస్పీ బాణోదయ మీడియాకు వెల్లడించారు. ఈగలు టీం ఇచ్చిన సమాచారం మేరకు 11 గ్రాముల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం.ఈ కేసు లో విశాల్, బత్తుల శ్రీనివాస్, లను అరెస్ట్ చేశామని చెప్పారు. దర్యాప్తులో బెంగుళూరుకి చెందిన సంజయ్ వద్ద నుండి విశాల్, శ్రీనివాస్ 30 వేల విలువైన 11 గ్రాముల MDM మత్తు పదార్థాన్ని గుంటూరుకి చెందిన ఖాజా అనే వ్యక్తికి సరఫరా చేస్తూ పట్టుబడ్డారు.ఖాజా మరియు విజయ్ సాగర్ పరారీలో ఉన్నారు, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు.







