Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: ఉత్సాహంగా సాగిన దివ్యాంగుల క్రీడా పోటీలు

SPORTS MEET FOR DISABLE PERSONS

దివ్యాంగులు… విభిన్న ప్రతిభావంతులని జిల్లా రెవిన్యూ అధికారి (డి.ఆర్.ఓ) ఎన్.ఎస్.కె.ఖాజా వలి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల శాఖ గుంటూరు ఎన్.టి.ఆర్ స్టేడియంలో దివ్యాంగులకుశనివారం క్రీడా పోటీలను నిర్వహించింది. ఈ పోటీలను డి.ఆర్.ఓ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు విభిన్న అంశాల్లో ప్రతిభ కలిగి ఉంటారని అన్నారు. ఎందరో దివ్యాంగులు ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులుగా, మోటివేటర్లుగా ఉన్నారని చెప్పారు  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా బ్రహ్మాండంగా రాణిస్తున్నారని చెప్పారు. దివ్యాంగుల్లో ప్రతిభకు కొదవలేదని వారిలో ఉన్న సృజనాత్మకతను మరింతగా వెలికి తీసి పదును పెట్టాల్సిన అవసరాన్ని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగుల్లో మంచి సృజనాత్మకతతో పాటు ఒక అంశం పట్ల స్పష్టమైన శ్రద్ధ ఉంటుందని అన్నారు. జిల్లాలో ఉన్న దివ్యాంగ క్రీడాకారులు మరింత పదునుతో క్రీడల్లో అభివృద్ధి చెంది జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను దివ్యాంగులకు అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యా, ఉపాధి అవకాశాల్లోను, క్రీడారంగంలోను రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి మరియు ఇన్చార్జ్ దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకుల డి.దుర్గా భాయి మాట్లాడుతూ డిసెంబర్ మూడో తేదీన దివ్యాంగుల దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈ దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలను వివిధ అంశాల్లో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. క్రీడా పోటీల్లోనూ, దివ్యాంగుల దినోత్సవం లోనూ పాల్గొనే దివ్యాంగ ఉద్యోగులకు ఆన్ డ్యూటీగా పరిగణించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ కల్పిస్తున్న అవకాశాలను దివ్యాంగులు అందిపుచ్చుకునే విధంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి. విజయ లక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వహక ఇంజనీర్ నజీమా, విభిన్న ప్రతిభావంతుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker