Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: కాంట్రాక్టు ఏఎన్ఎం లను కొనసాగించాలి: సీఐటీయూ డిమాండ్

CITU REPRESENTATION FOR ANMS

గతంలో రెండు దశాబ్దాల పాటు అర్బన్ హెల్త్ సెంటర్లలో కాంట్రాక్ట్ ఏఎన్ఎం లుగా పనిచేసి తదుపరి అన్యాయంగా తొలగించబడిన వారిని హైకోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి కొనసాగించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏఎన్ఎం లతో కలిసి గుంటూరు డి ఎం హెచ్ ఓ డాక్టర్ విజయలక్ష్మికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పట్టణ ప్రాంతాలలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లలో దాదాపు రెండు దశాబ్దాల పాటు ఏఎన్ఎంలు కాంట్రాక్టు పద్ధతి పై అతి తక్కువ వేతనంతో పని చేశారు. అనేక సందర్భాలలో యాజమాన్యాలు మారుతూ వచ్చినా ఉద్యోగుల పోరాటాల ఫలితంగా ప్రభుత్వాలు వారిని నిరవధికంగా కొనసాగిస్తూ వచ్చాయి. 2022లో నాటి వైసిపి ప్రభుత్వ హయాంలో అర్బన్ హెల్త్ సెంటర్ల స్టాప్ పాటర్న్ మార్పు చేసి అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు అందరిని ప్రభుత్వం తొలగించింది. ప్రత్యామ్నాయంగా మరోచోట ఉద్యోగాలు కొనసాగించాలని కోరుతూ ఏఎన్ఎంలు పదేపదే అధికారులు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాబ్ పెడచెవిన పెట్టింది. ఏఎన్ఎంలు తదుపరి ప్రయత్నంగా ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 15 అక్టోబర్ 2025వ తేదీ ఇచ్చిన ఉత్తర్వులలో పిటిషన్ దారులుగా ఉన్న సొంగ బసవ దేవి, జూగంటి రమాదేవి, వీర్నపు నాగేంద్రమ్మ, మంటి రోజు మేరీ, పెదపూడి లేయమ్మా, మన్యం మాణిక్యం తదితరులను కాంట్రాక్టు ఏఎన్ఎంలుగా 8 వారాలలోగా సర్వీసులోకి తీసుకొని కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల మేరకు ఏఎన్ఎం లందరినీ వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని కోరుతూ సిఐటియు జిల్లా కార్యదర్శి వై నేతాజీ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు డిఎంహెచ్ఓ కి వినతి పత్రం అందించారు. డిఎంహెచ్ఓ కే విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర అధికారుల సలహా మేరకు తదుపరి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ బసవ దేవి, జె రమాదేవి, ఎం మాణిక్యం, ఎం శిరోమణి తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button