Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

LIBRARY FESTIVAL IN GUNTUR

గుంటూరు అరండల్‌పేటలో 58వ గ్రంథాలయ వారోత్సవాలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గొనుగుంట్ల కోటేశ్వరరావులు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…గ్రంథాలయాల నిర్మాణానికి పునాది వేసిన మహోన్నతులు, ఉద్యమకారుల సేవలను స్మరించుకుంటూ, నవంబర్ 14 నుంచి వారం రోజులపాటు గ్రంథాలయాల మహోత్సవాల ద్వారా భావితరాలకు తెలియజేసే కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అరండల్‌పేట గ్రంథాలయం నుంచి ర్యాలీ రూపంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.నేటి సామాజిక మాధ్యమాల యుగంలో పిల్లలు, యువత గ్రంథాలయాల వైపు మళ్లాల్సిన అవసరం మరింత పెరిగిందని పేర్కొన్నారు. గ్రంథాలయం అనేది నాలుగు గోడల మధ్య పుస్తకాల సమాహారం మాత్రమే కాకుండా, ‘జ్ఞాననిధి’ అని, ప్రతి ఒక్కరూ జ్ఞానార్జన కోసం గ్రంథాలయాలను ఆశ్రయించాలన్నారు. దేవాలయాలంతే గ్రంథాలయాలు కూడా సమాజానికి అవసరమయ్యాయని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుర్తు చేశారు. గ్రంథాలయాల ద్వారా అనేక గొప్ప వ్యక్తులు తమ భావజాలం, విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించారని, అలాంటి స్థలాలను పునరుజ్జీవింపజేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో లైబ్రరీల అభివృద్ధి వేగంగా జరుగుతోందని అన్నారు.అలాగే, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ మంగళగిరిలో సాంకేతికతతో కూడిన ఐకానిక్ లైబ్రరీ ఏర్పాటు చేస్తూ రాష్ట్రానికి నూతన దిశ చూపుతున్నారని అభినందించారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదు; మనిషి వెల్నెస్, హెల్త్, ఆనందం కూడా అభివృద్ధి భాగమే అని నారా చంద్రబాబు నాయుడు చెప్పిన స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే మాధవి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రంథాలయ కమిటీ సభ్యులు, నాయకులు, నిర్వాహకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button