Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: జ్వోతీరావు పూలే గొప్ప సంస్కర్త

JYOTIRAO PULE DEATH ANNIVERSARY IN GUNTUR

జ్యోతి రావు పూలే గొప్ప సమాజ సంస్కర్త అని జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి అన్నారు. జ్యోతి రావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. జ్యోతి రావు పూలే  చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డి.ఆర్.ఓ మాట్లాడుతూ సమాజ సంస్కరణలలో అగ్రగామి, భారతీయ సామాజిక న్యాయ ఉద్యమానికి వైతాళికుడైన మహాత్మా జ్యోతిరావు గోవింద్రావు ఫూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పూణేలో జన్మించారన్నారు. చిన్న వయసులోనే అణగారిన వర్గాల స్థితిగతులు ఆయనను కదిలించాయని, చదువుపై ఆసక్తితో ముందుకు సాగిన ఆయన, సమాజంలో విద్యే సమానత్వానికి అసలు మూలం అనేది స్పష్టంగా గుర్తించారన్నారు. 1848లో భార్య సావిత్రీబాయి ఫూలేతో కలిసి భారతదేశంలోనే తొలి అమ్మాయిల పాఠశాలను ప్రారంభించి, మహిళా విద్యకు కొత్త యుగానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. దళితులు, పేదలు, మహిళలు, అల్పసంఖ్యాక వర్గాల జీవన ప్రమాణాల పెంపు కోసం జీవితాంతం పోరాడిన ఆయన అనేక పాఠశాలలను స్థాపించారన్నారు. ఫూలే సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి కులవివక్ష, అంధవిశ్వాసాలు, సామాజిక అసమానతలపై గట్టి పోరాటం సాగించారని వివరించారు. తన రచనల ద్వారా బానిసత్వంపై ధైర్యవంతమైన ఆలోచనలను సమాజానికి పరిచయం చేశారని తెలిపారు. మహాత్మా ఫూలే సేవలు భారతీయ సంస్కర్తలకు, స్వాతంత్ర్యోద్యమ నాయకులకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, విద్యా హక్కు కోసం ఆయన చూపిన దారి నేటికీ దేశానికి ఆదర్శమని, అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితమైన ఆయన సేవలు భారత చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.దుర్గా భాయి, తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker