Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: తాగునీటి ట్యాంకులు నిరంతరం శుభ్రపరచాలి

COLLECTOR MEANING ON WATER SUPPLY

గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు ఈఎల్ఎస్ఆర్ ( ఓవర్ హెడ్ ట్యాంక్ ) లను నిర్దేశిత సమయంలో క్రమం తప్పకుండా శుబ్రపరచాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారుల ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారిపై వరద నీటి డ్రైయిన్ల నిర్మాణం, నగరపాలక సంస్థ పరిధిలో వాటర్ ట్యాంక్ ల క్లీనింగ్ పై అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై చినకాకాని నుంచి తాడేపల్లి వరకు వరద నీరు నిలవకుండా ఉండేందుకు జాతీయ రహదారి అధికారులు, మంగళగిరి, తాడేపల్లి నగరపాల సంస్థ అధికారులు సమన్వయంతో డ్రైయిన్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఎంటిఎంసి అధికారులు ప్రతిపాదించిన ప్రణాళికలలో జాతీయ రహదారులు అధికారులు సూచనల మేరకు మార్పులు చేర్పులకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. గుంటూరు నగరపాల సంస్థ పరిధిలోని ఈఎల్ఎస్ఆర్ లు క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలన్నారు. శుభ్రపరచడానికి అవసరమైన ప్రెజర్ మిషన్లు కొనుగోలు చేసి నగరపాలక సంస్థ సిబ్బందితో శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉండవల్లి నుంచి రా వాటర్ ను మరింత మెరుగ్గా పంపించేయడానికి నిపుణుల సూచనల మేరకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. సమావేశంలో ఎంటీఎంసీ కమిషనర్ ఆలీం భాష, జాతీయ రహదారుల పీడి పార్వతీశం, గుంటూరు నగరపాలక సంస్థ ఎస్ఈ సుందర రామిరెడ్డి, రేట్ పెయిర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణరెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button