Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: న్యూమోనియా రహిత సమాజ స్థాపనే లక్ష్యం

MEDICAL AND HEALTH AWARENESS POSTER RELEASE

న్యూమోనియా వ్యాధి రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. న్యూమోనియా వ్యాధి పై అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. ప్రతీ సంవత్సరం నవంబర్ 12వ తేదిన ప్రపంచ న్యూమోనియా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఊపిరితిత్తులలో అసాధారణ ద్రవం చేరడం వల్ల శ్వాస తీసుకోవడానికి  ఇబ్బందిని కల్గించే పరిస్థితిని న్యూమోనియాగా పరిగణించడం జరుగుతుందని చెప్పారు. ఊపితిత్తులలో నెమ్ము చేరడం అని కూడా అంటారని తెలిపారు. నవంబర్12 వతేది నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు సాన్స్ (న్యూమోనియా లక్షణాలను త్వరగా గుర్తిద్దాం.. పిల్లల బాల్యాన్ని ఊపిరి పీల్చుకోనిద్దాం) ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సాన్స్ కార్యక్రమంలో ఇంటింటి సర్వేను ఆశా కార్యకర్తలు, ఏ. ఎన్. ఎమ్ లు, సి.హెచ్.ఓ లు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ ముగ్గురు ఒక బృందంగా ఇంటింటికి వెళ్లి 5 సంవత్సరాలలోపు పిల్లలను గుర్తించి వారికి న్యూమోనియా లక్షణాలు  పరీక్షించి, ఒకవేళ ఉంటే పి.హెచ్.సి వైద్యాధికారి కి రెఫెర్ చేస్తారన్నారు. ఆశాకార్యకర్తలు రెఫెర్ కేసులను పి.హెచ్.సి వైద్యులు కు చూపించి అవసరమైన చికిత్స అందేలా చూస్తారని తెలిపారు. న్యూమోనియా పై అవగాహన కల్గివుందాం… న్యూమోనియా లేని సమాజాన్ని ఏర్పరచుకుందాం… అని పిలుపునిచ్చారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి మాట్లాడుతూ దేశంలో 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలు న్యూమోనియా వల్ల ప్రతీ ఏటా అధికంగా జరుగుతున్నాయన్నారు. న్యూమోనియా ముఖ్యంగా 5 సంవత్సరాల లోవు పిల్లలకు, తక్కువ పౌష్టికాహారం తీసుకొను పిల్లలకు, 60 సంవత్సరాలు పైబడిన వారికి వచ్చే అవకాశాలు ఎక్కువన్నారు. పిల్లల మరణాలను నిరోధించడానికి సాన్స్ ప్రోగ్రాం ప్రతీ సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఎక్కువ సమయం పొగకు గురికావడం, వాతావరణంలో మార్పులు, చాలా తక్కువ వ్యాధి నిరోధక టీకాల స్థాయి కల్గిగి ఉండుట, పౌష్టికాహారం సరిగ్గా తీసుకోక పోవడం, బిడ్డకు సరైన వెచ్చదనం కల్గించక పోవడం వంటివి న్యూమోనియా రావడానికి కారణాలు అన్నారు. జలుబు, దగ్గు, త్వరగా శ్వాస తీసుకోవడం, శ్వాస తీసుకోవడంలో  పక్కలు(Ribs) ఎగరు వేయటం, అధిక జ్వరం, తల్లి పాలు, ఆహారం తీసుకొనక పోవుట, దడ, నిద్రమత్తు, ఛాతి అధికంగా కొట్టుకోవడం, అధిక బద్దకం, చురుకుగా లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. క్షేత్ర స్థాయిలో విరివిగా న్యూమోనియా పై అవగాహన సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.   

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button