Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం – ప్రొఫెసర్ కొండవీటి చిన్నయ సూరి

INTELLECTUAL MEETING IN GUNTUR

బానిస, రాచరిక వ్యవస్థలను అంతమొందించి స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం లాంటి నినాదాలతో ముందుకొచ్చిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి విద్యార్థులు కృషి చేయాలని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పూర్వ ఆచార్యులు ప్రొఫెసర్ కొండవీటి చిన్నయ సూరి పేర్కొన్నారు. ఈనెల 16వ తేదీ ఆదివారం ఉదయం గుంటూరు ఏసీ కళాశాలలోని అసెంబ్లీ హాలులో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పోటీ పరీక్షల శిక్షణా కార్యక్రమంలో ప్రజాస్వామ్య విలువలపై జరిగిన సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రొఫెసర్ కొండవీటి చిన్నయ సూరి ప్రసంగించారు. 18వ శతాబ్దంలో అమెరికాలో నెలకొని ఉన్న బానిస వ్యవస్థ పై నాటి అమెరికా అధ్యక్షులు అబ్రహాం లింకన్ సైనిక పోరాటం చేసి విజయం సాధించారని తెలిపారు. ప్రజాస్వామ్య మనేది ప్రజల ప్రభుత్వమని, ప్రజల చేత, ప్రజల కోసమని నాటి అబ్రహాం లింకన్ ప్రపంచానికి తెలియజేశారని గుర్తు చేశారు. 1789లో ఫ్రెంచ్ ప్రజలు రాచరికంపై తిరుగుబాటు చేసి స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం అనే నినాదాలతో ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పి నారని వివరించారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరునికి సమాన విలువ గల ఓటు హక్కును కల్పించడం ద్వారా నేడు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం కొనసాగుతుందని తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్, కస్టమ్స్ ఎస్. మధుబాబు, ఐఆర్ఎస్ ప్రసంగిస్తూ ప్రతి విద్యార్థి తార్కిక చింతనను పెంచుకొని ,జ్ఞాపక శక్తిని మెరుగు పరచుకుని, అధ్యయనం చేస్తే సత్ఫలితాలు కలుగుతాయని తద్వారా భవిష్యత్తు లో రాణించగలరని హితువు పలికారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని, మంచి లక్ష్యాలను రూపొందించుకుని ఏకాగ్రతతో, పట్టుదలతో ఇష్టపడి చదివితే ఆశించిన గమ్యస్థానాలను చేరుకోగలరన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ప్రతి అంశాన్ని అధ్యయనం చేసే క్రమంలో అవగాహన పెంచుకోవాలని, సమయాన్ని వృధా చేసుకోకుండా చదువుపై శ్రద్ధ పెడితేనే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ విద్యార్థులకు ఆర్థిక చేయూతను అందిస్తూ వాళ్లలో పోటీతత్వాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి కె. సతీష్, కె. పావని, కె. అరుణాచలం మరియు రిసోర్స్ పర్సన్స్ జి. ప్రకాష్, బేతపూడి మంగారావు, షేక్ రెహమాన్, ఆదినారాయణ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button