Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: భవిష్యత్తులో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగేనా ?

SUSPENSE ON ZP GENERAL BODY MEETING

జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం జరగాల్సిన ఉమ్మడి గుంటూరు జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. తుపాను కారణంగా ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు కూడా పూర్తిస్థాయిలో హాజరు కాలేదు. జెడ్పీ ఛైర్ పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కోరం కోసం కొంత సమయం వేచి చూశారు. చివరికి కోరం లేక పోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. త్వరలోనే సమావేశం నిర్వహణ తేదీని ప్రకటిస్తామని చెప్పారు. అయితే గతంలో కూడా జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో క్రిస్టినా జడ్పీ ఛైర్ పర్సన్ గా నియమితులయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం టీడీపీలో చేరిపోయారు. దీంతో ఎక్కువ సంఖ్యలో ఉన్న వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ లు, ఎంపీపీ లు ఛైర్ పర్సన్ పై ఆగ్రహంతో ఉన్నారు. ఇరువురి నడుమ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఉద్దేశపూర్వకంగానే జనరల్ బాడీ మీటింగ్ కు సభ్యులు హాజరు కాలేదని తెలుస్తోంది. మరోసారి జడ్పీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button