Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి

GUNTUR COMMISSIONER VISIT DEVELOPMENT PROGRAMMES

నగర ప్రజలు మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, ప్రధానంగా డ్రైనేజి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధ్యాన్యత ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ జిటి రోడ్ లో పారిశుధ్యం, నల్లపాడు రోడ్ లోని శ్రీనివాస కాలనీలో డ్రైనేజి సమస్య ఉన్న ప్రాంతాలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ తొలుత నల్లపాడురోడ్ లోని శ్రీనివాస కాలనీలోని పలు వీధులను, డ్రైనేజిని డ్రోన్ ద్వారా పరిశీలించి, స్థానికులు, అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని, మాట్లాడుతూ కాలనీలో డ్రైనేజి సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైన్ నిర్మాణానికి లెవల్స్ సపోర్ట్ చేయని ప్రాంతాల్లో నూతన సాంకేతిక ప్రమాణాలతో మ్యాజిక్ డ్రైన్ నిర్మించడానికి, కొండల నుండి వచ్చే వర్షం నీరు వెళ్లడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజలు కూడా వ్యర్ధాలను డ్రైన్లలో వేయవద్దని సూచించారు. నరసరావుపేట రోడ్ లో సెంట్రల్ డివైడర్లలో కలుపు తొలగించాలని హార్టికల్చర్ విభాగ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జిటి రోడ్ లో పారిశుద్య పనులను పరిశీలించి, మెయిన్ రోడ్లను ప్రతి రోజు ఉదయం పరిశుభ్రంగా స్వీపింగ్ చేయాలన్నారు. ఆయా మెయిన్ రోడ్లపై విధులు నిర్వహించే సమయంలో కార్మికులు తప్పనిసరిగా రేడియం జాకెట్స్ ధరించేలా చూడాలని శానిటేషన్ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లను ఆదేశించారు.పర్యటనలో కార్పొరేటర్ చల్లా రాజ్యలక్ష్మీ, ఎస్ఈ (ఇంచార్జి) సుందర్రామిరెడ్డి, ఈఈ విష్ణు, థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ నుండి మల్లికార్జునరావు, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button