Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి

GUNTUR COLLECTOR MEETING ON GREEVENCE

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో రెవెన్యూ అంశాలు పట్ల అందిన ఆర్జీలపై నియోజక వర్గం స్థాయిలో రెవెన్యూ నోడల్ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందిన ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య పట్ల పూర్తి అవగాహన పొందాలన్నారు. పి.జి.ఆర్.ఎస్ నామమాత్రంగా నిర్వహించటం లేదని ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. ఎస్.ఎల్.ఏ కాల పరిధి దాటకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. అర్జీదారునితో మాట్లాడి సమస్య పరిష్కారంకు చర్యలు తీసుకోవాలని తద్వారా మరల సమస్య వచ్చే అవకాశం ఉండదని తెలిపారు. ముందస్తుగా అర్జీదారులకు నోటీస్ జారీ చేసి ప్రక్రియను నిబంధనలు మేరకు చేపట్టాలని అన్నారు. తహసిల్దార్ లు సోమవారం అందుకున్న అర్జీల పట్ల శుక్రవారం నాటికి స్పష్టమైన సమాచారం కలిగి ఉండాలని చెప్పారు. రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.బియ్యం కార్డు వంటి సేవా పరమైన అంశాలు వచ్చేటపుడు నేరుగా దరఖాస్తు చేసుకునే విధంగా అధికారులు సహకరించాలని సూచించారు. బియ్యం కార్డుకు వచ్చే దరఖాస్తులు పౌర సరఫరాల శాఖ పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహా, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్ లు గంగ రాజు, లక్ష్మి కుమారి, శ్రీనివాస్, కలెక్టర్ కార్యాలయ విభాగాల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker