
వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఆక్టివిటీలో భాగంగా గుంటూరు రూరల్ మండలం వెంగళాయ పాలెం గ్రామ చెరువును గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ , స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులుతో కలిసి పరిశీలించారు. పరిశీలన అనంతరం 11వ తేదీన నిర్వహించబోయే వాటర్షెడ్ జాతీయ కార్యక్రమానికి సంబంధించిన సభా ప్రాంగణ ఏర్పాట్లను పెమ్మసాని గారు పరిశీలించారు. సభ ఏర్పాట్లను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకమైన వాటర్ షెడ్ పథకాన్ని డ్రాట్ ఎక్కడ ఉందో అక్కడ భూగర్భ జలాలు పెంచే విధంగా చర్యలు చేపడుతున్నాము. అయితే ఈ పథకాన్ని గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో అవకాశం లేక గ్రామీణ ప్రాంతంలో ఉన్న వెంగలాయపాలెం చెరువును ఎంపిక చేశాము. ఒక సమగ్రమైన వాట్ కింగ్ ట్రాక్, కమ్యూనిటీని ఎంగేజ్ చేసే విధంగా ప్రయత్నిస్తున్నాము. రూ. 1.2 కోట్లు ఖర్చు చేసి ఒక ఎంట్రన్స్ ప్లాజా, పార్కింగ్ ఏరియా, ఓపెన్ జిమ్, పిల్లల ఆటస్థలం, కమ్యూనిటీ గెదర్ ఏరియా, గెజిబో వంటి అన్ని సౌకర్యాలను కల్పించి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయబోతున్నాము. అయితే ఇంత ఖర్చు పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు బాధ్యత తీసుకొని దీని నిర్వహించుకునేలా చర్యలు చేపడుతున్నాము. ఇందుకుగాను 300 కొబ్బరి చెట్లు, ఫిషెస్ పెంపకం ద్వారా ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నాము. ఒక పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకొని నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టుకు 10 – 11వ తేదీలలో గుంటూరులో నేషనల్ వాటర్ షెడ్ కాన్ఫరెన్స్ ను నిర్వహించబోతున్నాము. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు అధికారులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. ఈ పైలెట్ ప్రాజెక్టును విజయవంతం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ద్వారా మన గుంటూరు జిల్లాలో మరిన్ని గ్రామాలకు నిధులు సేకరించి మోడల్ విలేజెస్ గా రూపొందించాలని ప్రయత్నిస్తున్నాము. దీన్ని దృష్టిలో ఉంచుకొని 10 రోజుల్లో యుద్ధప్రాతిపదికన ఎమ్మెల్యే బీ. రామాంజనేయులు, గ్రామీణాభివృద్ధి అధికారులు కలిసి సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి 11వ తేదీన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గహఆధ్వర్యంలో నిర్వహించబోతున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.







