chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: సామాజిక స్పృహతోనే వెట్టిచాకిరి నిర్మూలన

GUNTUR COLLECTOR MEETING ON CHILD LABOUR

సామాజిక స్పృహతోనే వెట్టిచాకిరి వంటి వ్యవస్థలను నిర్మూలన చేయవచ్చనిజిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. వెట్టిచాకిరి నిరోధక చట్టం 1976 (బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్) – నిఘా మరియు అమలు కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కమిటీ సభ్యులు అంకితభావంతో పనిచేసి వెట్టిచాకిరి వంటి వ్యవస్థ లేకుండా చూడాలని అన్నారు. సామాజిక స్పృహ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని, ప్రతీ ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు. మానవతా దృక్పథం ఉండాలని స్పష్టం చేశారు. చట్టాలపై అవగాహన పొందాలని సూచించారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, వాటిని వివిధ రకాలుగా అమలు చేసి సామాజిక రుగ్మతల నుండి విముక్తి కలిగించవచ్చని చెప్పారు. చెత్త కుప్పలపై వివిధ పదార్థాలు సేకరిస్తున్న వారిని కూడా గమనించడం జరిగిందని, అటువంటివారి రక్షణకు కూడా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రేషన్ పనిచేసే ప్రదేశాల్లో యాప్ ద్వారా తీసుకునేందుకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ప్రతినిధి ప్రియాంక వెట్టిచాకిరి నిరోధక చట్టం 1976ను గూర్చి వివరించారు. బాండెడ్ లేబర్ పిర్యాదును ఎవరైనా చేయవచ్చని తెలిపారు. బృందంగా వెళ్ళి తనిఖీలు నిర్వహించడం వలన మంచి ఫలితాలు ఉంటాయని వివరించారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఏ.గాయత్రి దేవి, జిల్లా విద్యా శాఖ అధికారి సి.వి. రేణుక, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు.చెన్నయ్య, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి పి.మురళీధర్, సభ్యులు గండి కోటేశ్వర రావు, ఈమని చంద్ర శేఖర్, బెల్లంకొండ శంకర రావు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker