Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍గుంటూరు జిల్లాఆంధ్రప్రదేశ్

Guntur : Drinking water supply disruption on 31st of this month and 1st and 2nd of September.. Commissioner Puli Srinivasulu

గుంటూరు నగరంలో ఈ నెల 31, సెప్టెంబర్ 1,2 తేదీల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం .. కమిషనర్ పులి శ్రీనివాసులు
ఈ నెల 31వ తేదీన ఉదయం సరఫరా అనంతరం నెహ్రూ నగర్ రిజర్వాయర్ నుండి హెచ్ఎల్ఆర్ రిజర్వాయర్ త్రాగునీటి సరఫరా జరిగే 900 ఎంఎం డయా పైప్ లైన్ కు నెహ్రూ నగర్ పంప్ హౌస్, సంజీవయ్య నగర్ రైల్వే గేటు వద్ద ఇంటర్ కనెక్షన్ చేయాడానికి జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు సిద్దం చేశారని, ఏఈల వారీగా త్రాగునీటి సరఫరా చేసేలా వాటర్ ట్యాంకర్లు సిద్దం చేసుకోవాలని ఆదేశించామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్ పనుల కోసం తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ లోని ఫిల్టరేషన్ పాయింట్ నిలిపివేయడం జరుగుతుందన్నారు. దీని వలన 31వ తేదీ సాయంత్రం నుండి సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం వరకు త్రాగునీటి సరఫరా అంతరాయం కల్గునని, 2వ తేదీ సాయంత్రం నుండి పాక్షికంగా 3వ తేదీ ఉదయం నుండి యధావిదిగా సరఫరా జరుగుతుందని తెలిపారు. పనుల వలన నగరంలోని హెచ్ఎల్ఆర్, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల, ఏటి అగ్రహారం, ఏఎంసి, హోసింగ్ బోర్డ్ కాలనీ, కోర్ట్ కాంపౌండ్, కెవిపి కాలనీ, వికాస్ నగర్, శ్యామల నగర్, హనుమయ్య నగర్, నెహ్రూ నగర్, రాజీవ్ గాంధీ నగర్, బొంగరాలబీడు, వసంతరాయపురం, శారదా కాలనీ, రెడ్డిపాలెం, గోరంట్ల, నగరాలూ తదితర ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాకి అంతరాయం కల్గుతుందన్నారు. కావున నగర ప్రజలు గుంటూరు నగర పాలక సంస్థకు సహకరించి ముందుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.

Authors

  • Guntur : Drinking water supply disruption on 31st of this month and 1st and 2nd of September.. Commissioner Puli Srinivasulu

    Rambabu K. is a senior Telugu journalist and the Bureau Chief of City News Telugu. Beginning his career in 1998, he has worked with leading media houses such as Eenadu, Sakshi, and Vaartha. With over 25 years of experience, Rambabu blends powerful reporting with innovative marketing strategies that strengthen local and digital journalism. Along with his editorial leadership, he plays a key role as a journalists’ union leader, actively advocating for press freedom, fair working conditions, and ethical reporting standards.

    View all posts
  • City News Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button