chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR LOCAL NEWS:గుంటూరు హిందూ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా

గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సోమవారం పట్టణంలోని హిందూ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించిన కలెక్టర్, పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన తాగునీరు, వైద్య శిబిరాలు వంటి కనీస సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా బస్సు సౌకర్యం, పరీక్షల సమయంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు తీరును, సమీపంలోని జిరాక్స్ సెంటర్ల మూసివేతను పర్యవేక్షించారు.

GUNTUR LOCAL NEWS:గుంటూరు హిందూ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి డా.షేక్ సలీం భాషా మాట్లాడుతూ, మార్చి 16 నుండి ప్రారంభమైన ఈ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 149 కేంద్రాలలో మొత్తం 27,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని ఆయన వివరించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.http://GUNTUR LOCAL NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker