గుంటూరు, అక్టోబర్ 7 :నరసరావుపేట పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు ఈ రోజు గుంటూరులోని తన స్వగృహంలో “2వ నారా చంద్రబాబు నాటకోత్సవం – 2025” పోస్టర్ను విడుదల చేశారు. అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నాటకోత్సవం జరగనుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు నాటక కళను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని పేర్కొన్నారు. నాటక కళాకారులకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో ఈ ఉత్సవాన్ని రెండోసారి నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
పోస్టర్ విడుదల కార్యక్రమంలో అభినయ అధ్యక్షులు అభినయ శ్రీనివాస్, ట్రస్టీ గుంటుపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ ఉత్సవం ద్వారా స్థానిక నాటక కళాకారులకు గుర్తింపు లభించే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు.