chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

గుంటూరు నగరంలో ఆధునిక రైతు బజార్ నిర్మాణానికి రంగం సిద్ధం-మేయర్, కమిషనర్ ప్రకటన

గుంటూరు;11-10-2025;-గుంటూరు నగర ప్రజల సౌకర్యార్ధం ఆధునిక వసతులతో కూడిన కొత్త రైతు బజార్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. బృందావన్ గార్డెన్స్‌లోని కుందుల రోడ్డుపై ఈ రైతు బజార్ నిర్మించనున్నట్లు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మరియు కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం ప్రకటించారు.

మార్కెటింగ్ శాఖ, నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా అధికారులతో కలిసి proposed రైతు బజార్ ప్రదేశాన్ని పరిశీలించిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రైతు బజార్ కోసం నగరపాలక సంస్థ ఇప్పటికే స్థలాన్ని కేటాయించిందని, అలాగే నిర్మాణానికి అవసరమైన నిధులను మార్కెటింగ్ శాఖ మంజూరు చేసిందని తెలిపారు.

రైతు బజార్‌ను ఆధునిక మోడల్‌ ఆధారంగా నిర్మించాలని, రెండు అంతస్తుల్లో విశాలమైన షాపులు, సెల్లార్ పార్కింగ్ వసతి వంటి మౌలిక సదుపాయాలతో ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మేయర్ ఆదేశించారు.

అంతేగాక, నిర్మాణ ప్రదేశంలో స్థల సర్వేను సమగ్రంగా నిర్వహించి, ఎలాంటి ఆక్రమణలు ఉన్నా, చట్టపరంగా తొలగించాలని సిటి ప్లానర్ మరియు సర్వేయర్లకు సూచించారు. రైతు బజార్ పరిసర ప్రాంతాల్లో రహదారి పైన ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే ఆక్రమణలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ అన్నారు.

ఈ పరిశీలనలో సిటి ప్లానర్ రాంబాబు, ఏసిపి రెహ్మాన్, మార్కెటింగ్ శాఖ ఏడి సత్యనారాయణ చౌదరి, కార్పొరేటర్ ఈరంటి వర ప్రసాద్, ఇతర అధికారులు, సిబ్బంది మరియు స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker