Guntur News: అట్టహాసంగా బీసి మంత్రుల అభినందన సత్కార సభ
FELICITATION FOR B.C MINISTERS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన అభినందన సత్కారం, అభినందన సభ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుములాల నుండి వివిధ హోదాల్లో ఉన్నబిసి ప్రజా ప్రతినిధులు, నేతలు, ఎన్డీయే కూటమి నేతలు, స్థానిక నేతలు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. తొలుత గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుండి వేంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ఎమ్మెల్యే గళ్ళ మాధవి భారీ బైక్ ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చేన్నాయుడు, సవిత, కొండపల్లి శ్రీనివాస్, కోలుసు పార్ధ సారధి మరియు ఆర్టిసి కార్పోరేషన్ చైర్మన్ కొనకళ్ళ నారాయణలను ఎమ్మెల్యే గళ్ళ మాధవి స్వాగతం పలికి వేదిక వరకు తోడ్కొని వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్, జ్యోతి రావు పూలే విగ్రహాలకు కింజరాపు రామ్మోహన్ నాయుడు,కింజరాపు అచ్చేన్నాయుడులు పూలమాలలు వేసి నివాళ్లర్పించగా, మంత్రి సవిత, ఎమ్మెల్యే గళ్ళా మాధవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బిసి నేతలు సంజీవ్ ఇతర నేతలు కింజరాపు రామ్మోహన్ నాయుడు,అచ్చేన్నాయుడు,సవిత, గళ్ళా మాధవి, దువ్వారపు రామారావులను భారి గజమాలతో సత్కరించారు. ఎమ్మేల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు, మొహమ్మద్ నసీర్ కార్పోరేషన్ చైర్మన్లు డేగల ప్రభాకర్, సావిత్రి హాజరయ్యి ప్రసంగించారు. యువగళం పాదయాత్ర మొదలుపెట్టి 2ఏళ్ళు అయ్యిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రులకు,ఎమ్మెల్యేలకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడిశెట్టి మురళీ,సింహాద్రి కనకాచారి, గుర్రపుసాల రామకృష్ణ, బండపల్లి శ్రీనివాస్ రావు,లక్ష్మి, నాగేశ్వరావు,రావికుమార్,భాస్కర్, గడ్డం శ్రీనివాస్, రమణ, వేములకొండ శ్రీనివాస్, పేరయ్య, చంద్రశేఖర్, రాచకొండ నాగేశ్వరరావు, పరమేశ్వర రావు, చంద్రగిరి బాబు, మురళీ తదితరులు పాల్గొన్నారు.