ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలన్నింటిని వేగవంతం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. నోడల్ అధికారులు కార్యదర్శులు చేస్తున్న సర్వేల పై ప్రత్యేక దృష్టి సారించాలని అడ్మిన్ కార్యదర్శులు, నోడల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరం నందు సచివాలయాల కార్యదర్శులు మరియు నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ తొలుత కార్యదర్శుల వారీగా మిస్సింగ్ సిటిజెన్స్, పి.ఏ.సి.యస్, హౌసింగ్ జియో ట్యాగ్, యన్.పి.సి.ఐ, నాన్ రెసిడెంట్ ఇన్ ఏ.పి, యం.యస్.యం. ఈ సర్వే ల పురోగతి పై వివరాలడిగి తెలుసుకొని, మాట్లాడుతూ సర్వేల వేగవంతం పై కార్యదర్శులు, నోడల్ ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి సారించి గురువారం నాటికి పూర్తి చేయాలన్నారు. ఇక నుండి సర్వేలను మరియు సచివాలయాలను ఆకస్మిక తనిఖీలు చేస్తామని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ మెరుగైన సేవలను అందించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండేవారిపై ఖటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సిటిజెన్ డేటాబేస్ ను సిద్దం చేయడానికి, సూక్ష్మ, మధ్యతరగతి వ్యాపార సంస్థలకు రాష్ట్ర మరియు కేంద్ర సంక్షేమ పధకాలు అమలు చేయడానికి సర్వేలు చేస్తున్నామన్నారు. సర్వేకు నగర ప్రజలు పూర్తి స్తాయిలో సహకరించి సచివాలయ కార్యదర్శులకు తగిన సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు.
Read Next
22 hours ago
స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా సిపిఎం ప్రచారం – ఫిరంగిపురంలో కరపత్రాల పంపిణీ||CPM Campaigns Against Smart Meters – Pamphlet Distribution in Phirangipuram
5 days ago
Guntur.. SP Satish Kumar congratulates CI Narayana Swamy for his service and presents him with a memento and a certificate of appreciation
1 week ago
గురుశిష్య పరంపరకు నిలువుటద్దం: ఫాదర్ యేరువ ఇన్నయ్య వర్ధంతి ఘన నివాళి
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
తాడేపల్లిలో బాబు షూరిటీ – మోసం గ్యారంటీ ఉద్యమం||Babu Surety – Cheating Guarantee Campaign in Tadepalli
2 weeks ago
తాడేపల్లిలో “బాబు షూరిటీ మోసం గ్యారంటీ” కార్యక్రమం ఘనంగా – కూటమి హామీలపై ప్రజా వ్యతిరేకత||Babu Surety Scam Guarantee” Held in Tadepalli – Public Anger Over Broken Alliance Promises
2 weeks ago
Check Also
Close