Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur News : ఆకట్టుకున్న వివా విద్యార్థుల “రోబోటిక్స్ ప్రాజెక్ట్స్ ఎక్స్పో”

వివా ది స్కూల్ నందు ఎడ్యూబెక్ ఇన్నోవేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్స్ ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటర్ నెట్ ఆఫ్ థింక్స్. 3డీ ప్రింటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యార్థులు రూపొందిచిన నమూనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు వాస్తవ ప్రపంచ సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేలా సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలతో 55 వినూత్న ప్రాజెక్టలను ఈ ఎక్సపోలో ప్రదర్శించారు. విద్యార్థులకు ఉపయోగపడేలా హ్యాండ్ రైటింగ్ మెషిన్, స్మార్ట్ మిర్రర్, రైతులకు ఉపయోగపడేలా ఆటోమేటిక్ ప్లాంట్ వాటరింగ్ సిస్టమ్ లు ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలో పాల్గొని ప్రాజెక్టు లను రూపొందించిన విద్యార్థులను చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, తల్లిదండ్రులు అభినందించారు. ఈ సందర్భంగా వివా ప్రిన్సిపల్ చదలవాడ సరళ మాట్లడుతూ వివా స్కూల్ ఆధునిక సాంకేతికతను విద్యార్థులకు అందించేందుకు గాను వారిలోని నైపుణ్యాలను పెంపొందించేలా ప్రాజెక్ట్స్ ఎక్స్ పో నిర్వహించడం జరిగిందని తెలిపారు. సృజనాత్మకత, సాంకేతికతతో విద్యార్థులు అద్భుత ప్రాజెక్టులను రూపొందించారని అన్నారు. ఎడ్యుటెక్ ఇన్నోవేషన్ ప్రతినిధి కె. కళ్యాణ్ మాట్లడుతూ భవిష్యత్ సాంకేతికతను విద్యార్థులకు అందించేలా 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు ప్రాగ్రామ్ రూపకల్పన చేయడం జరిగిందనీ, ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు మిషన్ లెర్నింగ్, ఐఓటి, ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సాంకేతికత పై శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎలిటి కమాండర్ కె.ఎస్. రావు, సిబిఎస్ఈ సంధానకర్త జ్యోతి మెటిల్డా, పివైపి సంధానకర్త కే.మాధవి, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button