Prakasamnews: రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేసేందుకు కృషి
రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేసేందుకు కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రభుత్వం పోలీసు ఉద్యోగులకు జిపిఎఫ్, సిపిఎస్, సరెండర్ లీవుల బకాయిలు చెల్లించినందుకు గాను ఆదివారం నాడు తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పలువురు పోలీసు ఉద్యోగులు కలసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి డోలా కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిమాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్రాంతి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులకు, కాంట్రాక్టర్లు, పోలీసు సిబ్బందికి బకాయిలు చెల్లించేందుకు రూ.6,700 కోట్లు విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని ఉద్యోగులు ఏ సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. ఉద్యోగులంతా బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి డోలా సూచించారు.