ఆంధ్రప్రదేశ్గుంటూరు

GUNTUR NEWS: తాడేపల్లి – ఘనంగా భగీరథ జయంతి వేడుకలు

BHAGEERADHA JAYANTHI

సగరుల ఆరాధ్యదైవమైన భగీరథుడి జయంతిని ఆదివారం తాడేపల్లి పట్టణంలోని బోసు బొమ్మ సెంటర్ సిపిఎం ఆఫీస్ వెనుక శివాలయంలో భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సగరులు భగీరథుడి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా సగరుల నాయకులు మాట్లాడుతూ భువి నుంచి దివికి గంగను తీసుకొచ్చేందుకు భగీరథుడు చేసిన కృషి ప్రశంస నీయమన్నారు. లక్ష్య సాధనలో ఆయన తీరు అందరికీ ఆదర్శనీయమన్నారు. అనంతరం ఉండవల్లి సెంటర్ లో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సగర నాయకులు కంభం సాయిచంద్, కటారి తిరుపతిరావు, పిన్నబ్రోలు నాగరాజు, ధూపాటి వాసు, నక్క వెంకటసుబ్బారావు, గార్లపాటి దుర్గారావు, గండికోట సోమరాజు, కటారి హరిబాబు,వెంకటేశ్వరరావు, ముసలయ్య, వెంకటకృష్ణ, గోపి, సుధీర్, నరసింహ, అరుణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button