Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్గుంటూరు

Guntur News: నిధుల గోల్ మాల్ పై బహిరంగ చర్చకు సిద్ధం

Guntur Mayor Challenge for Open Debate

బుడమేరు వాగు వరదల వరదల సమయంలో నగరపాలక సంస్థ నిధులను కమిషనర్ పులి శ్రీనివాసులు ఖర్చు చేసిన విషయంపై బహిరంగ చర్చకు రావాలని మేయర్ కావటి మనోహర్ నాయుడు సవాల్ విసిరారు. ఈ మేరకు సోమవారం డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ తో భేటీ అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ మీడియాతో మాట్లాడారు. నగర కమిషనర్ నిధుల ఖర్చు విషయంలో ఆధారాలు చూపించలేక కేవలం తనకు అధికారం ఉందని, ఇష్టారాజ్యంగా ఏం చేసినా చెల్లుతుంది అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కమిషనర్ చేస్తున్న ఆరోపణలకు తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. బహిరంగ చర్చకు ఎప్పుడు పిలిచిన తాము చేసిన ఆరోపణల పైన కూడా ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు. ఆధారాలు చూపలేని పక్షంలో ఎటువంటి చర్యలు తీసుకున్నా కట్టుబడి ఉంటామని వారు వెల్లడించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button