ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పశువైద్యుల క్రికెట్ లీగ్ -2025, నాగార్జున యూనిర్సిటీ రోడ్డులోని డాక్టర్స్ స్పోర్ట్స్ అకాడమీ నందు ఘనంగా ప్రారంభమైనది. ఈ కార్యక్రమములో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక సంచాలకులు డా. దామోదర్ నాయుడు , ఆంధ్ర ప్రదేశ్ గొర్రెల మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, డా. రజనీ కుమారి , గుంటూరు జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డా. నరసింహా రావు , రాష్ట్ర వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సర్వీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా. జయ ప్రకాష్ , జనరల్ సెక్రటరీ డా. ఈశ్వర్ రెడ్డి , గుంటూరు జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా. M. వెంకటేశ్వర్లు, 13 ఉమ్మడి జిల్లాల నుండి పోటీలలో పాల్గొనే పశువైద్య క్రీడాకారులతో పాటు సక్కు పౌల్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ. పరుచూరి వెంకట్ రామ్ , స్వస్తిక్ ఫార్మా మరియు వర్షా గ్రూప్ వారు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక సంచాలకులు డా. దామోదర్ నాయుడు గారు ప్రసంగిస్తూ ఇటువంటి క్రీడా కార్యక్రమాల ద్వారా పశువైద్యుల్లో నూతనోత్సాహం, క్రీడాస్పూర్తి మరియు పశువైద్యుల్లోని సత్సంబంధాలు పెంపొందుతాయని ఇటువంటివి విరివిగా జరిగించాలని సూచించారు.
ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పశువైద్యుల క్రికెట్ లీగ్ – 2025 ఈ నెల 4 వ తారీఖు నుండి 7 వ తేది వరకు జరుగుతాయని రాష్ట్ర వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సర్వీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా. జయ ప్రకాష్ తెలిపారు.