ఆంధ్రప్రదేశ్గుంటూరు

Guntur News: పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వాలి

CPI DEMAND HOUSE SITES FOR PUBLIC

పాత గుంటూరు పార్కు సెంటర్లో సిపిఐ 8 వ డివిజన్ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు పట్టణ, నగరంలో వున్న అర్హులైన పేదలకు 2 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి, 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని కోరుతూ అర్జీలు పూర్తి చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పాల్గొని పేదలకు నగరంలో 2 సెంట్ల ఇళ్ల స్థలం సాధించుకొనేందుకు సిపిఐ పార్టీ వారు రాసే అర్జీలు కార్యక్రమంలో అర్హులైన పేద ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఆది నుండి సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి ఇళ్లు లేని రాష్ట్రాన్ని నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డి కేవలం పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర ఇచ్చారని ఇది సరిపోదు.. కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామని, 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చంద్రబాబు చెప్పారని, పెరిగిన ధరల రీత్యా 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని, ఈ అంశంపై సిపిఐ గా మేము రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహించిన ఫలితంగా మొన్న జరిగిన క్యాబినెట్లో చేసిన ఇళ్ల స్థలాల తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఇల్లు లేని నిరుపేదలందరూ ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న వారందరికీ 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి, రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వాలని ఆయన అన్నారు. సిపిఐ పార్టీగా మేము ఆయా డివిజన్లో రాస్తున్న అర్జీ కార్యక్రమంలో అర్హులైన పేద ప్రజలందరూ పాల్గొని అర్జీలు రాయించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య, నూతలపాటి చిన్న, 8వ డివిజన్ సిపిఐ కార్యదర్శి కట్టా శ్రీనివాస్ రావు, స్థానిక నాయకులు కాయల రామారావు, నాగరాజు, రాజేష్, సతీష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button