GUNTUR NEWS: బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నమంగళగిరి గ్రామీణ పోలీసులు
POLICE ARREST DRINKERS
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి సిహెచ్ మురళీకృష్ణ, గ్రామీణ సీఐ వై శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలో గల కొబ్బరి తోట వెనుక నిర్మానుషమైన ప్రదేశంలో గస్తీ నిర్వహించి బహిరంగ మద్యపానం సేవిస్తున్న వ్యక్తులను మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ మరియు సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజా జనజీవనానికి వారి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా బహిరంగ మద్యపానం చేయడం చట్టరీత్యా నేరమని బహిరంగ మద్యపానం చేసేవారిని ఉపేక్షించేది లేదని, అదేవిధంగా మండల రూరల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరిపిన ఇటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ వెంకట్ హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతామని, బహిరంగ మద్యపానం సేవిస్తే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకట్ హెచ్చరించారు. మద్యం సేవించడంతోనే నేరాలు మొదలవుతాయని కావున మద్యపానానికి దూరంగా ఉండాలని మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ సూచించారు.