GUNTUR NEWS: వడ్డీ రాయితీతో ఆస్తి పన్ను చెల్లించడానికి సోమవారమే ఆఖరి రోజు… కమిషనర్ పులి శ్రీనివాసులు
PUBLIC INFORMATION
ఆస్తి పన్ను చెల్లించటానికి సోమవారం ఒక్కరోజే గడువు ఉన్నందున ఈ నెల 31వ తేదీ రంజాన్ పండుగ సెలవు రోజైనప్పటికీ పన్నుచెల్లింపుదారులకు సౌలభ్యంగా జిఎంసి ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లు ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు పని చేస్తాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆస్తి పన్ను వడ్డీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం రాయితీని వినియోగించుకొని పన్నుచెల్లించడానికి కేవలం ఒక్క రోజే గడువు ఉన్నందున, సెలవు రోజైన సోమవారం పన్ను చెల్లించడానికి వచ్చే వారికి వీలుగా ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను వడ్డీపై 50 శాతం రాయితీ ప్రకటించిన నాటి నుండి ఆదివారం వరకు షుమారు 17,850 మంది రూ.19.90 కోట్లు పన్ను చెల్లించారన్నారు. కౌంటర్లు ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు పని చేస్తాయన్నారు. ఆదివారం ఒక్కరోజే రూ.2 కోట్లు పన్ను వసూళ్లు జరిగిందని, వడ్డీ రాయితీతో పన్ను చెల్లించడానికి చివరి అవకాశం కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.