ఆంధ్రప్రదేశ్గుంటూరు

GUNTUR NEWS: మిర్చికి క్వింటాలుకు రూ.20 వేల మద్దతు ధర కల్పించండి

FORMER ASSOCIATION VISIT GUNTUR MIRCHI YARD

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం సోమవారం గుంటూరు మిర్చి యార్డులో పర్యటించింది. మిర్చి రైతులు మార్కెట్ యార్డ్ లో పడే కష్టాలను, పడుతున్న కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రైతులందరూ ముక్తకంఠంతో ఒకే ఒక మాటను చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే వి వి ప్రసాద్ మాట్లాడారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మిర్చి రైతులకు ఇస్తామని చెబుతున్న 11,781 రూపాయిల మద్దతు ధర అని ప్రకటించడం మిర్చి రైతులకు తీరని అన్యాయం చేసినట్లేనని చెప్పారు. కనీసం 20,000 అయినా ప్రకటిస్తారని రైతులు ఎదురు చూశారని రైతులు ఆశలను అడియాసలు చేశాయని రైతులు వాపోయారు. తీరా ఇక్కడికి వస్తే గుంటూరు మార్కెట్ యార్డులు వ్యాపారస్తుల దోపిడీకి రైతులు కుదైలైపోతున్నారని మచ్చు పేరుతో, కమిషన్ పేరుతో దొడ్డి పేరుతో గోతం పేరుతో ఒక కింటాకు వెయ్యి రూపాయల వరకు దోపిడీ చేస్తున్నారని తెలిపారు‌. ఎంతో దూరం ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకువచ్చి వెనక్కి తీసుకో పోలేక వారు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి వస్తుందని ఆయన వెల్లడించారు.
వీటి పైన ప్రభుత్వం నియంత్రణ ఉండాలని లేకపోతే ఆసియాలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డులో ఎన్నో రైతుల కన్నీటి గాథలు ఉన్నాయని వారు వాపోయారు. వారందరితో మాట్లాడి వారికి అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భరోసానిచ్చింది.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button