GUNTUR NEWS: స్వర్ణాంధ్ర – స్వచ్చంద్రాలో భాగంగా ఈ-వ్యర్ధాల నిర్వహణపై కార్యక్రమం
ENVIRONMENT PROGRAME IN GUNTUR
ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఉపకరణాల వ్యర్దాలను సైంటిఫిక్ పద్దతిలో ప్రాసెస్ చేయటం ద్వారానే పర్యావరణాన్ని కాపాడటంతో పాటు సర్కూలర్ ఎకానమీని సృష్టించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి కె విజయనంద్ తెలిపారు. శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్చంద్రాలో భాగంగా ఈ-వ్యర్ధాల నిర్వహణపై గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి కె విజయానంద్, రాష్ట్ర స్వఛ్చంద్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మరెడ్డి పట్టాభిరామ్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ, నగర కమిషనరు పులి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ ఇన్చార్జి మేయరు షేక్ సజీలా, శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులతో కలసి పాల్గొన్నారు. శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరం అవరణలో రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి కె విజయానంద్, రాష్ట్ర స్వఛ్చంద్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ, నగర పాలక సంస్థ కమిషనరు పులి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ ఇన్చార్జి మేయరు సజీలా, శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులు మెక్కలు నాటి, నగరంలో ఈ – వ్యర్ధాల సేకరణ చేసే వాహనంను ప్రారంభించి, సిగ్నేచర్ క్యాంపెయిన్ లో సంతకం చేశారు . ఈ – వ్యర్ధాల నిర్వహణ పై ఏపి కాలుష్యనియంత్రణ మండలి, ఆర్ఈఎస్ఆర్ఆర్ సంస్థ, స్వర్ణాంధ్ర – స్వఛ్ఛాంధ్ర ఫోటో ఎగ్జిబిషన్, జిఎంసి ఎలక్ట్రానిక్ వ్యర్ధాల సేకరణ కౌంటర్, నారాకోడూరు, మూట్లూరు, సిరిపురం, పేరేచర్ల, జీజీపాలెం, రావెల జిల్లా పరిషత్ హైస్కూల్, డిల్లీ పబ్లిక్ స్కూల్, సుమేధ, వీఐటీ, ఎస్ఆర్ఎం విధ్యార్ధులు, ఐటీసీ, రాజధాని ఎయిర్ కండీషనింగ్ మరియు రిఫ్రజరేషన్ టెక్నిషియన్ వెల్పేర్ అసోసియేషన్, గుంటూరు మొబైల్ టెక్నికల్స్ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనంద్ పరిశీలించారు. ఈ సంధర్భంగా జరిగిన సభలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దటంలో బాగంగా ప్రతి నెల మూడవ శనివారం అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో స్వర్ణాంధ్ర – స్వఛ్ఛంద్ర కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక థీమ్ తో చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అన్నిప్రభుత్వ శాఖలతో పాటు ముఖ్యమైన 11 ప్రభుత్వ శాఖలలో స్వఛ్చత కార్యక్రమాలపై సూచికలను ఇవ్వటం జరుగుతుందన్నారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ప్రతి ఒక్కరూ విరివిగా వినియోగిస్తున్ననేపథ్యంలో ఈ-వ్యర్ధాలు ఉత్పత్తి కూడా ఎక్కువుగా ఉంటుందన్నారు. వీటిని సరైన పద్దతిలో ప్రాసెస్ చేయకుండా పారవేస్తే భూ కాలుష్యం, నీటి కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతారన్నారు. ఈ-వ్యర్ధాల నిర్వహణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతోనే ఈనెల స్వర్ణాంధ్ర – స్వఛ్ఛంద్ర కార్యక్రమంలో ఈ – చెక్ అంశంపై కార్యక్రమాలు నిర్వహించటం జరిగిందన్నారు. ఈ-వ్యర్ధాలపై అవగాహన కోసం ర్యాలీ, ఎక్స్ పో లో చాలా చక్కగా నిర్వహించారని, వ్యర్ధాల రీసైక్లింగ్, రీయూజ్, సరైన ప్రాసెస్ చేయకపోతే పర్యావరణంకు కలిగే నష్టాలపై ప్రదర్శనలో చాలా చక్కగా అవగాహన కల్పించారన్నారు. ఈ–వ్యర్ధాల సేకరణకు గుంటూరుతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రెడ్యూస్, రీ యూజ్, రీ సైక్లీంగ్ (ఆర్ఆర్ఆర్) సెంటర్లును ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. ఈ-వ్యర్ధాలను ఆర్ఆర్ఆర్ సెంటర్ల నిర్వహణ ద్వారా సర్కూలర్ ఎకనమీని సృష్టించవచ్చని దీని కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక పాలసీని త్వరలో తీసుకురానున్నారన్నారు. రాష్ట్రంలో గత మూడు నెలలుగా జరుగుతున్న స్వర్ణాంధ్ర – స్వఛ్చంద్ర కార్యక్రమంలో 1.90 కోట్ల మంది పాల్గొన్నారని, స్వచ్ఛత కార్యక్రమాలను ఉద్యమంగా యుద్ధప్రాతిపదికన ప్రజలు, అధికారుల, ప్రజాప్రతినిధులు, స్వఛ్చంద సేవ సంస్థల బాగస్వామ్యంతో కొనసాగించటం ద్వారా స్వఛ్చంద్ర తద్వారా స్వర్ణాంద్ర సాద్యం అవుతుందన్నారు.