ఎడ్యుకేషన్గుంటూరు

Guntur News: జిల్లా షెడ్యూల్డ్ కులముల సంక్షేమం మరియు సాధికారిత అధికారి

జిల్లా నందు గల 9, 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదువు చున్న షెడ్యూల్డ్ కులముల విద్యార్థి, విద్యార్థినిలకు తెలియజేయునది ఏమనగా, తల్లికి వందనము పధకములో స్కాలర్ షిప్ మంజూరు అగుటకు గాను బ్యాంకు ఖాతా లేదా పోస్టల్ ఖాతాలకు NPCI అనుసంధానము చేసుకోవలసియున్నది.
కావున, ప్రముఖంగా మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ వారిని లేదా బ్యాంకు వారిని సంప్రదించి 9, 10 వ తరగతి విద్యార్థుల తల్లులు మరియు ఇంటర్మీడియట్ చదువు చున్న విద్యార్ధి, విద్యార్ధులు బ్యాంక్ ఖాతాలను తెరచి NPCI అనుసంధానము చేసుకోవలసిందిగా కోరడమైనది. దీనికి సంబందించి ఏమైనా సందేహములు ఉన్న ఎడల మీకు అనుసంధానమైన గ్రామ మరియు వార్డ్ సచివాలయము నందు వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్/ వార్డ్ ఎడ్యుకేషనల్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారిని సంప్రదించవలసినదిగా తెలియజేయటమైనది. శ్రీయుత సంచాలకులు సాంఘిక సంక్షేమ శాఖ, ఎ.పి., అమరావతి వారు ఆదేశముల మేరకు మీ గ్రామ మరియు వార్డ్ సచివాలయము నందు పోస్టల్ డిపార్టుమెంటు వారి ద్వారా రేపు అనగా శనివారం తేది. 14-06-2025 న స్పెషల్ క్యాంప్స్ నిర్వహించబడునని తెలియజేయడమైనది. లేదా మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ వారిని కూడా సంప్రదించగలరని కోరడమైనది.

Authors

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button