Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
గుంటూరుఆంధ్రప్రదేశ్

GUNTUR POLITICAL NEWS: డొక్కా మాణిక్యవరప్రసాద్ కి మతి భ్రమించింది

YSRCP LEADERS PRESS MEET

టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అసమర్థుడని వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు పేర్కొన్నారు. ఎమ్మెల్యే అసమర్థుడు అయినందునే ఆయన తరపున డొక్కా మాణిక్యవరప్రసాద్ వకాల్తా పుచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. డొక్కా మతి భ్రమించి మాట్లాడుతున్నాడని చెప్పారు. అసలు తాడికొండ నియోజకవర్గంతో డొక్కాకి ఏంటి పని అని డైమండ్ బాబు సూటిగా ప్రశ్నించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదనే భావనతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు. దమ్ముంటే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మాణిక్యవరప్రసాద్ మాట్లాడాలని హితవు పలికారు. హద్దు మీరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో టీడీపీకి స్పష్టమైన వైఖరి లేదని తెలిపారు. చంద్రబాబు మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. రాజధానిలో ఏళ్ల తరబడి నిర్మాణాలు చేస్తున్న కారణంగా భూముల ఇచ్చిన రైతులకు నష్టం జరుగుతోందని చెప్పారు. రాజధాని నిర్మాణంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. సీబీఎన్ రియల్ ఎస్టేట్ తప్పు అమరావతి రాజధానిలో ఎలాంటి పురోగతి లేదని ఆయన స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button