ఆంధ్రప్రదేశ్

Health Minister Satya Kumar Yadav: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 6 మంది అనారోగ్య బాధితులకు చెక్కులు అందించిన ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

పుట్టపర్తి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు నేడు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (ఎంఆర్ఎఫ్) ద్వారా 6 మంది అనారోగ్య బాధితులకు చెక్కులను అందించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం వివిధ రకాల సహాయ కార్యక్రమాలను ప్రవేశపెట్టి, అనారోగ్య బాధితుల‌కు సహాయం అందించేందుకు ఎప్పుడూ కృషి చేస్తుందన్నారు. “ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొని, ఆపత్కాలంలో వారికి మద్దతుగా నిలవడానికి నిరంతరం సంకల్పబద్ధంగా పనిచేస్తోంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అనారోగ్య బాధితులు సహాయం పొందడంపై ప్రాధాన్యత ఇస్తూ, ఎంఆర్ఎఫ్ ద్వారా ఎంతోమంది ప్రజలకు సాయం అందిస్తున్నాం” అని మంత్రి తెలిపారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker