chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Vijayawada Local News:హెల్మెట్‌ ధరించిన వాహనదారులకు పూలతో అభినందన-ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం ఐపీఎస్

విజయవాడ, నవంబర్ 08:-రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన సృష్టించాలనే లక్ష్యంతో ఎన్.టి.ఆర్. జిల్లా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ శ్రీమతి షిరీన్ బేగం ఐపీఎస్ పర్యవేక్షణలో నగరంలోని ప్రధాన చౌరస్తాల్లో హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ ధారణ, ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు

Vijayawada Local News:హెల్మెట్‌ ధరించిన వాహనదారులకు పూలతో అభినందన-ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం ఐపీఎస్

.ఈ సందర్భంగా హెల్మెట్ ధరించిన బైక్ రైడర్లు, సీట్‌బెల్ట్ వేసుకున్న కార్ డ్రైవర్లు, యూనిఫాం ధరించి మోటారు వాహన చట్టాలను గౌరవించిన ఆటో డ్రైవర్లను పోలీసులు పూలతో సత్కరించారు. ఈ అభినందనలు ఇతర వాహనదారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

డీసీపీ షిరీన్ బేగం మాట్లాడుతూ, “చట్టాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత. హెల్మెట్ లేదా సీట్‌బెల్ట్‌ వాడడం మన ప్రాణ రక్షణకు చిహ్నం. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి. స్వీయ భద్రతే కుటుంబ భద్రత అని గుర్తుంచుకోవాలి” అని పిలుపునిచ్చారు.డీసీపీ గారి నేతృత్వంలో కొనసాగుతున్న ఈ అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో చట్టపరమైన చైతన్యాన్ని పెంపొందిస్తున్నాయని అధికారులు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker