AP NEWS: పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టెక్ AI 2.0 కాన్క్లేవ్
CM CHANDRABABU ATTEND ANIMALS MEETIG
పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జీఎఫ్ఎస్టీ సహకారంతో టెక్ AI 2.0 కాన్క్లేవ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. జీఎఫ్ఎస్టీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు మేధోమథనం వర్క్ షాపు నిర్వహించారు. రాష్ట్రంలో లైవ్ స్టాక్ పరిస్థితి ఎట్లా ఉంది, రైతుల భాగస్వామ్యం, ఏ విధంగా పురోభివృద్ధి సాధించాలి, రైతులకు లాబాలను ఎలా తీసుకురావాలి అనే విషయాలపై చర్చించడం జరిగింది. రెండో రోజు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వివిధ స్టార్టప్ ప్రతినిధులు ముఖ్యంగా పౌల్డ్రీ రంగంలో రైతులు అనుసరించాల్సిన సాంకేతికతను, డైరీ స్టార్టప్, పిగ్గరీ స్టార్టప్ లాంటి వాటిపై ప్రజెంటేషన్ ను అందించారు. రాష్ట్రంలో పశువుల పెంపకంలో రైతులు చేపడుతున్న విధానాలు, గొర్రెలు, మేకల పెంపకంలో తమ అనుభవాలను రైతులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రైతులకు ఏవిధంగా లాభం చేకూరుతుంది, రైతులకు ఎంత మేరకు ప్రయోజనం కలుగుతుందో అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వివిధ పథకాల ద్వారా అందిస్తున్న సహకారంపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఉన్న మంచి స్టార్టప్ లను రాష్ట్రంలో కూడా అమలు చేసి రైతాంగానికి మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు. ముందుగా ముఖ్యమంత్రి అధికారులతో కలిసి మూడు పుస్తకాలను ఆవిష్కరిచడం జరిగింది. అనంతరం బయో లుంపివ్యాక్సిన్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. (పశువుల్లో స్కిన్ డిసీజ్ వాక్సిన్)