Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్అమరావతి📍గుంటూరు జిల్లా

Amaravathi local News :-హాస్టళ్లలో అక్రమాలను సహించేది లేదు-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి :28-11-25:-బీసీ హాస్టళ్లలో అక్రమాలను అస్సలు సహించబోమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. పులివెందుల అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారిణి బి. జ్యోతి అవినీతి, అక్రమాల ఆరోపణలు రుజువుకావడంతో ఆమెను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాగే, ఈ అక్రమాలకు పరోక్షంగా సహకరించిన జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి అంజలదేవీని విధుల నుంచి రిలీవ్ చేస్తూ విజయవాడ హెడ్ ఆఫీస్‌కు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

శుక్రవారం ఈ మేరకు మంత్రి సవిత ప్రకటన విడుదల చేశారు. పులివెందుల అధికారిణి జ్యోతిపై తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జాయింట్ డైరెక్టర్ ద్వారా విచారణ నిర్వహించగా, ఆరోపణలు నిజమని తేలినట్లు వివరించారు. దాంతో వెంటనే సస్పెన్షన్ చర్యలు తీసుకున్నామని చెప్పారు.తల్లిదండ్రుల స్థానంలో ఉండి విద్యార్థుల భద్రత, సౌకర్యాలకు బాధ్యత వహించాల్సిన హాస్టల్ సిబ్బంది అక్రమాలకు పాల్పడటం తీవ్రంగా ఖండించిన మంత్రి సవిత, “ప్రభుత్వంపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టళ్లకు పంపిస్తున్నారు. ఆ నమ్మకాన్ని దెబ్బతీయడం ఏ పరిస్థితుల్లోనూ సహించం” అని హెచ్చరించారు.సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీ విద్యార్థులకు పోషకాహారం, ఆరోగ్య భద్రతతో కూడిన నాణ్యమైన విద్య అందించడానికే కట్టుబడి ఉందని చెప్పారు. ప్రభుత్వ లక్ష్యాలకు వ్యతిరేకంగా పనిచేసే ఎవరిపైనా కఠిన చర్యలు తప్పవని మంత్రి సవిత స్పష్టంచేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker