chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Road Safety: 25,000 Reward is a Vital Support for Good Samaritans || రోడ్డు భద్రత: ప్రమాద బాధితులను కాపాడే రహ్-వీర్లకు రూ. 25,000 నగదు ప్రోత్సాహం

Road Safety: 25,000 Reward is a Vital Support for Good Samaritans || రోడ్డు భద్రత: ప్రమాద బాధితులను కాపాడే రహ్-వీర్లకు రూ. 25,000 నగదు ప్రోత్సాహం

బాపట్ల, జనవరి.13 : జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రోజు ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదల జరిగుతూ ఉంటాయని ఆ సమయంలో గాయపడిన వారికి సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఎ.ఎస్, పిలుపునిచ్చారు.

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు రహ్-వీర్ లకు నగదు ప్రోత్సాహం మరియు వారి రక్షణ కు సంబంధించిన పోస్టర్స్ ను కలెక్టర్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రోజు ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదల జరిగుతూ ఉంటాయని ఆ సమయంలో గాయపడిన వారికి సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చూచించారు.ప్రమాదం జరిగినప్పుడు వెంటనే మొదటి గంట సమయం చాలా విలువైనదని, ఆ గంట లోపు సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సహాయం అందేలా చేసినట్లయితే ప్రమాద బాధితులను ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చన్నారు. ఎక్కువగా టు వీలర్స్ నడిపేవారు యాక్సిడెంట్స్ కు గురవుతున్నారని, టు వీలర్ నడిపేవారంతా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు.
రోడ్డు ప్రమాద బాధితులకు సహాయపడేవారికి రహ్-వీర్ సన్మాన పత్రం తో పాటుగా రూ.25 వేలు నగదు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రమాద బాధితులకు సహాయపడే వారిని, వారి పేరు మరియు వివరాలు చెప్పమని పోలీసు వారు గానీ హాస్పిటల్ వారు గాని ఒత్తిడి చెయ్యడానికి లేదని తెలిపారు. ప్రతి ఒక్కరు ప్రమాద బాధితులకు సహాయం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు .

ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి టి.కె.పరంధామ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, బాపట్ల మునిసిపల్ కమిషనర్ రఘునాధ రెడ్డి, ఆర్. టి.సి ఆర్,ఎం. సి. హెచ్ విమల, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ డి.బి.వి. రంగా రావు, ఎన్. ప్రసన్న కుమారి, బి. కిషోర్ బాబు, మెడికల్ ఆఫీసర్ ఎ. నరేంద్ర కుమార్, కలెక్టరేట్ ఎ. ఓ మల్లికార్జున రావు మరియు రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker