ఆంధ్రప్రదేశ్
Hyderabad:బడిబాట పట్టిన విద్యార్థులు…
వేసవి సెలవులు అయిపోయిన తర్వాత న్యూ అకడమిక్ ఇయర్ కోసం విద్యార్థులు హుషారుగా స్కూల్లకు వెళ్తున్నారు. అబిడ్స్ , హిమాయత్ నగర్ ప్రాంతాలలో స్కూలు యజమాన్యం కూడా విద్యార్థులకు నూతన ఉత్తేజం కల్పించేలా మామిడి తోరణాలు, బెలూన్లు ఏర్పాటుచేసి డెకరేషన్ చేసి విద్యార్థులకు కొత్తదనంతో పాటు ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు మొదటి రోజు స్కూల్ కు రావడంతోనే కొత్తగా డెకరేషన్ ఉండడంతో పరిసరాలను వింతగా చూస్తూ ఆశ్చర్యపోతూ పాఠశాలలో అడుగు పెట్టారు.