
హైదరాబాద్:- నగరంలోని కార్వాన్ డివిజన్లో చెత్త సమస్యకు చెక్ పెట్టేందుకు కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. Greater Hyderabad Municipal Corporation ఆధ్వర్యంలో కార్వాన్ ప్రాంతంలో చెత్త సేకరణను మరింత వేగవంతం చేసేందుకు 20 కొత్త సైకిల్ రిక్షాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

All India Majlis-e-Ittehadul Muslimeen పార్టీ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు, కార్వాన్ ఎమ్మెల్యే Kausar Mohiuddin సహకారంతో ఈ రిక్షాలు మంజూరయ్యాయి. కార్వాన్ వార్డ్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ కొత్త సైకిల్ రిక్షాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో AIMIM మాజీ కార్పొరేటర్లు, GHMC శానిటేషన్ సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ… కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ సైకిల్ రిక్షాల ద్వారా కాలనీలు మరియు గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లలో చెత్త సేకరణ మరింత సమర్థవంతంగా నిర్వహించగలమని తెలిపారు.Hyderabad local Ne దీంతో కార్వాన్ డివిజన్లో పరిశుభ్రత మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.







