ఆంధ్రప్రదేశ్

hydrabad news :ఓ వ్యాపారి ఇంట్లో చోరీకి పాల్పడ్డ నలుగురు దొంగలను నారాయణగూడ పోలీసులు అరెస్టు #telangaana #news

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

అంబర్పేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈస్ట్ డిసిపి బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం హైదర్ గూడ లోని అవంతి నగర్ లో నివాసం ఉండే రామకృష్ణ వ్యాపారి.గత నెల 25 న యాత్రకు వెళ్ళారు.అతని తండ్రి వృద్ధుడు కావడంతో ఇంట్లోనే ఉంచి వెళ్ళారు.నాల్గవ అంతస్తులో ఉన్న ఇంట్లో బీరువాలో దాచిన రూ.17 లక్షల 50 వేల నగదు,173 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించారు. టర్కీ నుంచి శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత రామకృష్ణ బీరువా పగలగొట్టి ఉండటాన్ని గమనించాడు.అనుమానం వచ్చి బీరువాలో దాచిన విలువైన బంగారు ఆభరణాలు నగదును చూడగా కనిపించలేదు.దీంతో ఆందోళన చెందిన రామకృష్ణ పోలీసులకు పిర్యాదు చేశాడు.రామకృష్ణ పిర్యాదు మేరకు క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.1.58 తులాల గోల్డ్,10 లక్షల 75 వేలు నిందితుల దగ్గరి నుండి స్వాధీనం చేసుకున్నాము.నిందితులు A1 చౌపాల్ సాగర్,A2 ఆకాష్ కుమార్, a3 ఆశిష్, A4 అశ్విన్,A 5 షాలిని రచు,A 6 సక్లేన్ ఖాన్, a7 చంద్రశేఖర్ గా గుర్తించాం.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker