
వేటపాలెం: మత సామరస్యానికి ప్రతీకగా, పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వేటపాలెం మండలం దేశాయిపేట ఆబాద్ నగర్లో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరై, ముస్లిం సోదరులకు స్వయంగా విందు వడ్డించి వారితో కలిసి ఆరగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండటమే సమాజ లక్ష్యమని పేర్కొంటూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. షేక్ ఖాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మత పెద్దలు మౌలానా మూఫ్తి, సుభాని అల్ మష్ కురి ప్రత్యేక దువా నిర్వహించారు. రంజాన్ అంటే సమానత్వం, ఐక్యత అని, పేదవాని ఆకలి తీర్చడమే ఇస్లాం ముఖ్య ఉద్దేశమని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు సయ్యద్ షకీల్, సయ్యద్ వసీం, షేక్ ఖదీర్ భాషా, మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ మాబు, టిడిపి సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య, షేక్ మక్బూల్ తదితరులు పాల్గొన్నారు.http://BAPATLA NEWS







