
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు మరియు ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీనా బేగం ఆదేశాల మేరకు, జగ్గయ్యపేట సిఐ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముఖ్యంగా యువత మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, రోడ్లపై ప్రమాదకర విన్యాసాలు చేయడం వల్ల ప్రాణాపాయం సంభవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం, అతివేగం వంటి ఉల్లంఘనలను గుర్తించిన వెంటనే ఈ-చలానాలు జారీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొని వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.http://NTR DISTRICT NEWS







