Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News: జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు ఆర్థిక భరోసా-MLC నాగబాబు

బాపట్ల: నవంబర్ 24 :-జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సంక్షేమం పట్ల పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చూపుతున్న శ్రద్ధకు కొనసాగింపుగా, ప్రమాదవశాత్తు మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఆదివారం బాపట్ల నియోజకవర్గానికి చెందిన హుకుమతిరావు నాగంజనేయులు కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు.జనసేన సభ్యత్వం తీసుకుని పార్టీ కోసం పనిచేసిన వివిధ కార్యకర్తలు ప్రమాదాలలో మృతి చెందడంతో, వారి కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 220 మంది సభ్యుల కుటుంబాలకు మొత్తం రూ.11 కోట్లు జనసేన అందజేసినట్లు నేతలు తెలిపారు.

బాపట్లలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన జనసేన నాయకులు విన్నకోట సురేష్, హుకుమతిరావు నాగంజనేయులు భార్యను అన్నపూర్ణ కన్వెన్షన్ హాలుకు తీసుకువెళ్లి, నాగబాబు చేతుల మీదుగా చెక్కును అందజేశారు. పార్టీ తరఫున లభించిన ఈ సహాయానికి బాధిత కుటుంబ సభ్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాయకులు విన్నకోట సురేష్‌కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, బాపట్ల నియోజకవర్గ జనసేన నాయకులు పసుపులేటి మహేష్, గరిగంటి శ్రీనివాసరావు, సాయిన రాంబాబు, గుర్రాల రామారావు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button